విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ గుడ్ న్యూస్! ఎలాగైనా వచ్చే వన్డే వరల్డ్కప్..
Wed May 14, 2025 15:55 Sports
ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ గుడ్న్యూస్ చెప్పింది. వాళ్లు టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వాళ్ల A+ కాంట్రాక్ట్ కొనసాగుతుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. వారు భారత క్రికెట్లో భాగమై ఉన్నారని, A+ సౌకర్యాలు గతంలో మాదిరే వారికి లభిస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకారం, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ... "టీ20, టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ A+ కాంట్రాక్ట్ కొనసాగుతుంది. వారు ఇప్పటికీ భారత క్రికెట్లో భాగమే. వారికి గ్రేడ్ A+ యొక్క అన్ని సౌకర్యాలు లభిస్తాయి" అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. కాగా, బీసీసీఐ రూల్స్ ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండే ఆటగాళ్లకు మాత్రమే గ్రేడ్ A+ కాంట్రాక్ట్లు ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే, 2024లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలిగారు. అలాగే ఇటీవల టెస్ట్ ఫార్మాట్కు కూడా వీడ్కోలు పలికారు. 'రో-కో' (రోహిత్-కోహ్లీ) ప్రస్తుతం భారత జట్టు తరఫున బరిలోకి దిగే ఏకైక ఫార్మాట్ వన్డేలే. ఈ ద్వయం 2027 ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే వన్డే ఫార్మాట్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఎలాగైనా వచ్చే వన్డే వరల్డ్కప్ ఆడాలనేది వారి కోరిక. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు బోల్తాపడి ట్రోఫీని త్రుటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అదృష్టాన్ని పట్టేశాడబ్బా.. ఆ లాటరీపై 15 ఏళ్లుగా ప్రయత్నం! ఎట్టకేలకు రూ.8 కోట్లు గెలిచిన ఇండియన్..
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ప్రధాని మోడీ కీలక సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్! ఎప్పుడు అంటే.?
వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత పార్టీకి రాజీనామా!
నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!
ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!
ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!
ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Sports #teamindia
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.